3, డిసెంబర్ 2009, గురువారం

బుజ్జి - మల్లెచెట్టు

మొన్న వర్షం పడ్తుంటే అమ్మ చెప్పింది కాస్త మల్లెకి ఆకులు దుసి పొయ్యి,మళ్ళి ఆగష్టులో పూలు పుస్తాయ్ అని. ఆ పని చేశాలే...అప్పుడు గుర్తోచ్చింది...పోయినసారి మల్లెచెట్టు పుసినప్పుడు నాకు కవిత్వం తన్నుకొచ్చి ఒక పాత పుస్తకం లో రాసాను అని.అది ఇవాళ వెతికి పట్టుకుని ఇక్కడ ఎక్కిస్తున్న.పూర్తిగా సొంతామే..కాకపొతే కవిత్వం కాదు :)

ఆహ!స్వర్గానికి రెండే అడుగుల దూరం...ఈ అమోఘ సువాసన నాకు ఏదో తెలియని ఆనందాన్ని ఇస్తుంది అని మా మల్లెచెట్టు   పూలు విసిరే సువాసనను ఆస్వాదిస్తూ అనుకున్నాను.ఆ రెండు అడుగులు ఏంటో తెలుసా?కలల అలలపై తేలే మల్లెపువ్వు లాంటి మనసును ఆ స్వర్గానికి చేర్చే సుతిమెత్తని మెట్లు మా మల్లెపువ్వులే.వాటిని వొద్దికగా పేరిస్తే ఆ రెండు అడుగుల మెట్లు తయారవుతాయి.కాని వాటిని కోసుకుని ఆ మెట్లని చేసే మనసు రాదు.

పిల్లగాలికి హాయిగా తలలు ఊపుతూ పున్నమి రేయి తారలను ధిక్కరిస్తూ,మేము మీకన్నా బాగా మేరవటమే కాక సువాసన కుడా ఇస్తున్నమోచ్ అని ముసి ముసి నవ్వులు నవ్వుతు చెప్తాయి మా పూలు.పగటి ఎండ వేడిని కుడా నిశి తారలను ఎక్కిరించినట్టే ఎక్కిరించాబోయి వాడి,తలలు వాల్చి,జాలిగా మూగాబోతాయి.ఒక్క క్షణం లోనే ఆ నవ్వులు మాయం అవుతాయి.

రోజు ఈ జాలి చూపులు చూడలేక,వాటిని రాత్రి బాగా పొద్దుపోయాక,అవి వెన్నెల రాత్రిని బాగా అస్వదించాయి అని నిర్ధారించుకున్నాక,కోసి గుండెలనిండా వాటి సువాసన నింపుకుని..తాడు తో దండ కట్టలేక(మాకు రాక),సూదికి గుచ్చలనే ఆలోచనకే మనసు విలవిలలాడి,ఆ విడి పువ్వులనే దేవుని పాదాల చెంత వుంచి సంతోషిస్తుంటాం.

మొదటి పువ్వు పూసిన రోజు,మొదటగా మల్లె రాణి మా ముంగిటికే వచ్చింది అని సంతోషించాము. ఇది మల్లెల వేళ కాకపోయినా మా కోసమే మల్లె పూసింది అనుకున్నాము.పెరటి చెట్లన్ని ఈ మల్లె ముందు దిగదుడుపే అయ్యాయి.
రోజుకి లెక్ఖలేనన్ని పూలని ఇస్తున్న మల్లేని చూసి నేను ముందు చూసాను అంటే కాదు నేను అని పోటి పడి దాని ప్రభాత దర్శనం చేసుకున్నాం.మా మల్లె పూలు ఎన్ని రోజులు పూస్తే అన్నీ రోజులు మేము ఆ మల్లె చెట్టుకే దాసోహం.

కాని పది రోజుల తర్వాత నాలుగే పూలు పూసింది.ఆ రోజు కుడా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసాం.మరునాటి నుండి మల్లె ఉనికి చాటే సువాసన లేదు..మమ్మల్ని తట్టి లేపి ఆ చెట్టు దగ్గరకు తీసుకుపోయే సువాసన లేనేలేదు.ఇహ మొగ్గలు లేవని మనసుకి కుడా తెలిసిపోయిందేమో.. ..పాపం ఎదురు చూసి చూసి..తల వాల్చింది మల్లె...

మనం స్వర్ధపరులం. బాగా పుసినన్నాళ్ళు తన కోసం ఒక్క పువ్వు కుడా దాచుకోకుండా పిండి వెన్నెలలా మమ్ము ఆనందిమ్పచేసిన మల్లె ఇహ పూలు అయిపోగానే ఒక మామూలు మొక్క ఐపోయింది.మనసులో మల్లె తెచ్చిన భావుకతా లేదు..ఒక్కసారి ఆ పూలు లేని మల్లె చెట్టుని పలకరిద్దాం అనే ఆలోచనా లేదు.

మళ్ళి మల్లెలు పూస్తాయి..అప్పుడు మళ్ళి బిలబిల మంటూ మల్లె దగ్గరికి చేరిపోతాం..అప్పుడు ఏ మాత్రం సంకోచం లేకుండా మా మల్లె చెట్టు అనుకుంటూ ఆ సువసనలో తెలిపోతాం..
అంతే జీవితం...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి